హైదరాబాద్: తెలంగాణ ఈ సెట్–21 ఆన్లైన్ దరఖాస్తు గడువును మరోమారు పొడిగించారు. కరోనా నేపథ్యంలో ఈ నెల 31 వరకు విద్యార్థులకు అప్లయ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు టీఎస్ ఈ సెట్ కన్వీనర్ సీహెచ్.వెంకటరమణారెడ్డి తెలిపారు. షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు గడువు ఈనెల 18న ముగిసింది. అయితే రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా వైరస్ను నిలువరించడానికి ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దీంతో ఎలాంటి అపరాధ రుసుము లేకుండా మే 24 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. కాగా, నేటితో ఆ గడువు ముగియడంతో మరోమారు పొడిగించారు.
ఈ పరీక్ష ద్వారా ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ మ్యాథ్స్ కోర్సులు చేస్తున్నవారికి బీటెక్ సెకండియర్లోకి ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను TSCHE తరఫున జేఎన్టీయూ నిర్వహిస్తున్నది.
దరఖాస్తు ఫీజు: రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400
వెబ్సైట్: ecet.tsche.ac.in