న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ (సీఐఈటీ) లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ అప్లికేషన్లు ఈనెల 23 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 పోస్టులను భర్తీ చేయనుంది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. నూతన జాతీయ విద్యావిధానంలో (ఎన్ఈపీ) నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్స్ను అభివృద్ధి చేయడంలో భాగంగా వివిధ ప్రాజెక్టుల్లో ఈ పోస్టులు ఉన్నాయి. ఎంపికైనవారు న్యూఢిల్లీలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 25
ఇందులో సీనియర్ టెక్నికల్ కన్సల్టెంట్ 2, టెక్నికల్ కన్సల్టెంట్ 10, డాటా సైన్స్ స్పెషలిస్ట్ 2, డాటా అనలిస్ట్ 2, మొబైల్ యాప్స్ స్పెషలిస్ట్ 2, సోషల్ మీడియా మేనేజర్ 2, గ్రాఫిక్ డిజైన్ 3, అకౌంటెంట్ 1, ఆఫీస్ అసిస్టెంట్1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ కానీ పీజీ కానీ 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్. దరఖాస్తుల ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో (గూగుల్ ఫామ్). నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను పూర్తిగా నింపి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 23
వెబ్సైట్: https://forms.gle/JJrRnmGz7Z5ytDYn6 l