హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కలికిరిలో ఉన్న సైనిక పాఠశాలలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 7 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 18 టీజీటీ, ఎల్డీసీ, ఎంటీఎస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులు ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 18
ఇందులో టీజీటీ సోషల్ సైన్స్ 1, మ్యాథ్స్ 1, లోవర్ డివిజన్ క్లర్క్ 2, ఎంటీఎస్ 14 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: టీజీటీ పోస్టులకు సిబీఎస్సీ నిబంధనల ప్రకారం అర్హతలు ఉండాలి. ఎల్డీసీ, ఎంటీఎస్ పోస్టులకు మెట్రిక్యులేషన్ పూర్తిచేయాలి. అభ్యర్థులు 21 నుంచి 35 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 7
వెబ్సైట్: www.sskal.ac.in