న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కరోనా బారినపడ్డ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు, జ్యుడీషియల్ ఆఫీసర్లు వారి కుటుంబాల కోసం కొవిడ్-19 సంరక్షణ కేంద్రంగా ఫైవ్స్టార్ హోటల్ను ఎంపిక చేశారు. సెంట్రల్ ఢిల్లీలోని అశోక హోటల్లో వంద గదులను బుక్ చేసినట్లు చాణక్యపురి సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ గీతా గ్రోవర్ ఉత్తర్వుల్లో తెలిపారు. ఇందులో ప్రిమస్ హాస్పిటల్ కొవిడ్ కేర్ సేవలను అందుస్తుందని పేర్కొన్నారు. బయోమెడికల్ వ్యర్థాలు పారవేయడం దవాఖాన బాధ్యతేనని, హోటల్ సిబ్బందికి అన్ని రక్షణ సామగ్రి అందించడంతో పాటు తగిన శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. గదులు, హౌస్ కీపింగ్, రోగులకు ఆహారం పంపిణీ సేవలను హోటల్ నిర్వాహకులు అందజేస్తారని డీఎం పేర్కొన్నారు. ఆసుపత్రి హోటల్కు డబ్బులు చెల్లిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఢిల్లీలో పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో హాస్పిటళ్లలో బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. ఇదిలా ఉండగా.. ఢిల్లీలో సోమవారం 380 మరణాలు నమోదయ్యాయి. అలాగే 20వేలకుపైగా తాజాగా కరోనా కేసులు నమోదయ్యాయి.