హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పద్యకవి, ప్రభుత్వ విశిష్ఠ పురసార గ్రహీత, ప్రముఖ సాహితీవేత్త జనగామ జిల్లాకు చెందిన వెలపాటి రామారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం సంతాపం ప్రకటించారు. వ్యవసాయం, రైతు సమస్యలను తన కవిత్వం ద్వారా ఆవిషరించిన రైతుకవి వెలపాటి అని సీఎం గుర్తుచేసుకున్నారు. తెలంగాణ వస్తువును కవిత్వాంశంగా చేసుకొని రచనా వ్యాసాంగాన్ని సాగించిన వెలపాటి మరణంతో, తెలంగాణ, ఒక ఉత్తమ సాహితీవేత్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. దివంగత వెలపాటి రామారెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.