వరంగల్ అర్బన్ : ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు క్రిస్టినా జెడ్ చోంగ్తు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతితో కలసి కరుణాపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఓట్ల కౌంటింగ్కు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. మరింత సమర్థవంతంగా చేయాలని పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కౌంటింగ్ కోసం చేస్తున్న ఏర్పాట్లపై అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి జనరల్ అబ్జర్వర్కు వివరించారు. కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ గ్రేటర్ పరిధిలోని 66 వార్డులకు కౌంటింగ్కు 3 బ్లాక్లను ఏర్పాటు చేశామన్నారు.
ఆయా బ్లాక్లకు సమీపంలోనే 6 స్ట్రాంగ్ రూమ్ లలో బ్యాలట్ బాక్స్ లను భద్రపరిచామన్నారు.
ప్రతి గదిలో కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా బారికేడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఆర్డీవో వాసు చంద్ర, బల్దియా ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈలు, డీఈలు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రాణం పోసిన దవాఖానలో.. మొక్కను నాటిన మహిళ
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్
సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ మృతిపట్ల మంత్రి వేముల సంతాపం
కొనుగోలు కేంద్రాలతోనే రైతులకు మేలు