హైదరాబాద్ : ఈ నెల 1 నుండి 17 వరకు జరిగిన కుంభమేళాలో రాష్ట్రం నుంచి పాల్గొన్న వారందరూ తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు తెలిపారు. కచ్చితంగా 14 రోజుల పాటు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలన్నారు. ఇంట్లోనూ మాస్కు ధరించాలని సూచించారు. జలుబు, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ కొవిడ్ నిర్దారణ పరీక్షల కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఇక్కడ పరీక్షలను ఉచితంగా చేయనున్నట్లు చెప్పారు. ఈ విషయంలో ఇంకా ఏమైనా సందేహాలుంటే 104 నెంబరుకు కాల్ చేసి తెలుసుకోవాల్సిందిగా పేర్కొన్నారు.