న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) క్లర్క్ పోస్టుల నియామక ప్రక్రియ చేపట్టింది. క్లరికల్ క్యాడర్లో 5121 కస్టమర్ సపోర్ట్, సేల్స్ విభాగంలో జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేస్తున్నది. దీనికి సంబంధించిన దరఖాస్తు గడువును పొండిగించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17న దరఖాస్తు ముగుస్తుండగా, దానిని మరో మూడు రోజులపాటు ఎక్స్టెండ్ చేసింది. దీంతో ఈనెల 20 వరకు అధికారిక వెబ్సైట్లో అప్లయ్ చేసుకోవచ్చని తెలిపింది. ఇందులో హైదరాబాద్ రీజియన్లో 275 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులకు స్థానిక భాష తప్పనిసరిగా తెలిసి ఉండాలి.
అర్హత: డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులకు 2021, ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: మూడు విభాగాలుగా ఉంటుంది. మొదటి దశలో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 100 మార్కులను ప్రశ్నలు ఇస్తారు. అన్ని ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. పరీక్షను గంట వ్యవధిలో రాయాల్సి ఉంటుంది.
రెండో దశ.. మెయిన్ ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు ఆజ్జెక్టివి విధానంలో ఉంటాయి. పరీక్షను 2.40 గంటల్లో పూర్తిచేయాలి.
వీటిలో అర్హత సాధించినవారికి లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 20
ప్రిలిమినరీ రాతపరీక్ష: జూన్ నెలలో
మెయిన్ పరీక్ష: జూలై 31
వెబ్సైట్: https://www.sbi.co.in/