న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంతోపాటే, నీటి కాలుష్యం కూడా రోజురోజుకు పెరిగిపోతున్నది. నగరంలోని వివిధ పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలను నదుల్లోకి వదులుతుండటంతో నీరంతా కలుషితమై పోతున్నది. పరిశ్రమల నుంచి వచ్చి చేరే విష రసాయనాల కారణంగా నదుల్లోని నీటి ఉపరితలంపై తెల్లని విషపు నురుగలు పేరుకుపోతున్నాయి. యుమునా నది నీటిపై కూడా పలుచోట్ల విషపు నురుగలు మేటవేశాయి. కలింది కుంజ్ ఏరియాలో నీటిపై విషపు నురుగలకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.