మహబూబ్నగర్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. సమసమాజ నిర్మాణం కోసం ప్రతిక్షణం తపించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. అందుకే ఆయన అడుగు జాడల్లో అందరూ నడవాలని మంత్రి పిలుపునిచ్చారు.
మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండలో నూతనంగా ప్రతిష్టించిన బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అలాగే తెలంగాణ చౌరస్తా వద్ద హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన భవనాన్ని ప్రారంభించారు.
పద్మావతి కాలనీలో ప్రభోద సేవా సమితి ఆందుజ్ఞాన వేదిక మహబూబ్నగర్ శాఖ ఆధ్వర్యంలో ఉగాది పండుగను పురస్కరించుకొని త్రైత సిద్ధాంతం తెలుగు సంవత్సర క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు. అశోక్టాకీస్ చౌరస్తా వద్ద అఖిల భారత అయ్యప్ప ప్రచార కమిటీ ఆధ్వర్యంలో, బండ్లగేరిలో మంత్రి శ్రీనివాస్గౌడ్ తండ్రి విరసనోళ్ల నారాయణగౌడ్ జ్ఞాపకార్థం చలివేంద్రాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలకొండ రూపురేఖలే మారిపోయాయని అన్నారు. ఇక్కడ జీవనం సాగించేందుకు ఎందరో ఆతృత కనబర్చుతున్నారని చెప్పారు. బైపాస్ రోడ్డు ఈ ప్రాంతం మీదుగా వెళ్లడంతో ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందిందన్నారు.
ఇవి కూడా చదవండి..
సాగర్ వెనుకబాటుకు జానారెడ్డే కారణం
దివ్యాంగులకు అండగా ఎమ్మెల్సీ కవిత
రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారు
మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ : మంత్రి కొప్పుల
చెరువులో దూకి వ్యక్తి ఆత్మహాత్య