న్యూఢిల్లీ : మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో కొవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడం ఊరట కలిగిస్తోంది. ఈ రాష్ట్రాల్లో రోజువారీ కొవిడ్-19 పాజిటివ్ కేసుల నమోదు తగ్గగా కర్నాటక, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికమయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది.
గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 12,481 తాజా కేసులు వెలుగుచూడగా పాజిటివిటీ రేటు 17.76 శాతానికి తగ్గింది. మహమ్మారి బారినపడి ఒక్కరోజే దేశ రాజధానిలో 347 మంది మరణించారు. ఇక 13 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులున్నాయని, 26 రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 15 శాతం పైగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.