న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ, కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వచ్చే నెల 9వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తులు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఎంపికైన వారు స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ అండ్ అన్నేమ్డ్ సిస్టమ్స్ ఎబీయూ, బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 9
ఇందులో ట్రైనీ ఇంజినీర్ 6, ప్రాజెక్ట్ ఇంజినీర్ 3 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఎయిరో స్పేస్, ఎయిరోనాటికల్ ఇంజినీరింగ్లో బీఈ, బీటెక్తోపాటు ఎంఈ, ఎంటెక్ చేసి ఉండాలి. అభ్యర్థులు 25, 28 ఏండ్లలోపువారై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్. నిర్ణీత నమూనాలోని దరఖాస్తులను సంబంధిత చిరునామాకు పంపించాలి.
అడ్రస్: MANAGER(HR/SC&US), Bharat Electronics Ltd, Jalahalli, Bangalore– 560013
అప్లికేషన్ ఫీజు: ట్రైనీ ఇంజినీర్ రూ.200, ప్రాజెక్ట్ ఇంజినీర్ రూ.500
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 9
వెబ్సైట్: bel-india.in