మారిన ఓయూ డిస్టెన్స్ పరీక్షల తేదీలు

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రొఫెసర్ జీ రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్సీడీఈ) పీజీ కోర్సుల పరీక్ష తేదీల్లో అధికారులు మార్పులు చేశారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం మెయిన్, బ్యాక్లాగ్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి రెండు నుంచి జరగాల్సి ఉన్నాయి. అయితే వాటిని వారం రోజులపాటు వాయిదావేశారు. దీంతో ఫిబ్రవరి 10 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. దీనిప్రకారం..
ఫిబ్రవరి 10న (బుధవారం)- పేపర్-1
ఫిబ్రవరి 11న (గురువారం)- పేపర్-2
ఫిబ్రవరి 12న (శుక్రవారం)- పేపర్-3
ఫిబ్రవరి 13న (శనివారం)- పేపర్-4
ఫిబ్రవరి 15న (సోమవారం)- పేపర్-5/ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ పేపర్-1 ప్రాక్టికల్స్
ఫిబ్రవరి 16న (మంగళవారం)- పేపర్-6/ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ పేపర్-2 ప్రాక్టికల్స్
పరీక్షలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు నిర్వహిస్తారు.
తాజావార్తలు
- మోసాలకు పాల్పడుతున్న ముఠాల అరెస్ట్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
- లగ్జరీ కారులో రయ్యిమంటూ దూసుకుపోతున్న అల్లు అర్జున్
- ఆన్లైన్లో భద్రాద్రి రామయ్య కల్యాణం టికెట్లు
- ఇక స్కూళ్లల్లోనూ ఇంటర్ పరీక్ష కేంద్రాలు
- లాస్యతో కుమార్ సాయి స్టెప్పులు... వీడియో వైరల్
- తిరుపతి మార్గంలో 18 రైళ్లు రద్దు: ఎస్సీఆర్
- పదేండ్ల తర్వాత టీటీడీ కల్యాణమస్తు
- నేడు బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ.. తొలి విడత అభ్యర్థుల ప్రకటన!
- స్నేహితురాలి పెళ్లిలో తమన్నా సందడి మాములుగా లేదు