హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) 2021-22 విద్యా సంవత్సరానికి గాను ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ నుంచి పోస్టుగ్రాడ్యేయేట్ ప్రోగ్రాం (PGPEx)లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 30 వరకు అందుబాటులో ఉంటాయి.
కోర్సు పేరు: మాస్టర్ ఆఫ్ బిజినెస్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)
కోర్సు కాలవ్యవధి: రెండేండ్లు
అర్హతలు: 55 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. 2021, మే 30 నాటికి మూడేండ్ల అనుభవం ఉండాలి. కేవలం ఎగ్జిక్యూటివ్ స్థాయి మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. క్యాట్, జీమ్యాట్, జీఆర్ఈలో వ్యాలిడ్ స్కోర్ ఉండాలి. వ్యాలీడ్ టెస్ట్ స్కోర్ లేకుంటే ఐఐఎం విశాఖపట్నం నిర్వహించే పరీక్ష రాయాల్సి ఉంటుంది.
ఎంపిక: క్యాట్, జీమ్యాట్, జీఆర్ఈ, ఐఐఎంవీ టెస్ట్ స్కోర్ ఆధారంగా
దరఖాస్తు: ఆన్లైన్లో
చిరునామా: Indian Institute of Management Visakhapatnam (IIMV),
Andhra Bank School of Business Building,
Andhra University Campus, Visakhapatnam: 530003
ఈ-మెయిల్: pgpexadm@iimv.ac.in
అప్లికేషన్ ఫీజు: రూ. 1000
దరఖాస్తులకు చివరితేదీ: మే 30
వెబ్సైట్: https://www.iimv.ac.in