వరంగల్ : భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించేందుకే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా నగరంలోని 5వ డివిజన్ దాసరి వాడ, 52వ డివిజన్ రాంనగర్లో పర్యటించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ..వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే మన నగరాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మొక్కలు నాటిన ప్రతి ఒక్కరు వాటి పరిరక్షణ భాధ్యతలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇస్తున్నాం. ఖచ్చితంగా వాటిని నాటి వాటి పరిరక్షణ బాధ్యత తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని కానుకగా ఇద్దామన్నారు.
అలాగే ఇంటి పరిసరాలలో మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడాలి. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వరంగల్ నగరాన్ని ప్లాస్టిక్ రహిత, పచ్చని నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు.
నగరంలో పేరుకుపోయిన సమస్యలు పట్టణ ప్రగతి కార్యక్రమంలో సమర్థవంతంగా పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి హరితహారం లక్ష్యాన్ని సాధించాలన్నారు. కార్యక్రమంలో కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, కార్పొరేటర్లు పోతుల శ్రీమాన్, చాడ స్వాతి, చెన్నం మధు, సోదా కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎలుకలు 12 బాటిళ్ల మద్యం తాగేశాయ్!
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీశ్రావు
దళిత వాడలో పల్లె నిద్ర చేసిన ఎమ్మెల్యే ఆనంద్
ఒలింపిక్స్కు భారీ టీమ్ను పంపనున్న చైనా
వెదజల్లే పద్ధతితో అధిక దిగుబడి : మంత్రి అల్లోల