పలు గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపోక్లోరైట్ పిచికారీ
పెన్పహాడ్, మే 15 : కరోనా కట్టడికి మండలంలోని దోసపహాడ్, అనంతారం, చీదెళ్ల, పెన్పహాడ్ తదితర గ్రామాల్లో శనివారం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచులు కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచులు దొంగరి సుధాకర్, బైరెడ్డి శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దొంగరి యుగేందర్, గోపి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
తుంగతుర్తి : మండలంలోని కేశవాపురంలో గ్రామ పంచాయతీ సిబ్బంది సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అనిత మాట్లాడుతూ కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది వెంకన్న, తూము వీరయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.
పాలకవీడు : మండలంలోని హన్మయ్యగూడెంలో హైపోక్లోరైట్ పిచికారీ చేయించినట్లు సర్పంచ్ కందుకూరి సరిత తెలిపారు. కరోనా వ్యాపిస్తున్నందున ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గ్రామంలోని అన్ని వీధుల్లో బ్లీంచిగ్ చల్లించి, హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించామన్నారు. ప్రజలందరూ మాస్కులు ధరించాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ క్రాంతి, టీఆర్ఎస్ నాయకుడు ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.
గరిడేపల్లి : కరోనా వైరస్ను అరికట్టేందుకు మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ టి.సీతారాంరెడ్డి శనివారం పంచాయతీ సిబ్బందితో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించారు. గ్రామస్తులందరూ స్వీయ నియంత్రణ, లాక్డౌన్ నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భద్రయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
మునగాల మండల కేంద్రంలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని శనివారం పిచికారీ చేశారు. చింతకాయల ఉపేందర్ పర్యవేక్షించి మాట్లాడారు. ప్రజలు కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకయ్య, వార్డు సభ్యులు తంగెళ్ల చిన్న, దేవరం శ్రీనివాస్రెడ్డి, రవి, పంచాయతీ సిబ్బంది