న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలో భాగమైన వెస్ట్రన్ రైల్వే ఖాళీగా ఉన్న పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 17 గ్రూప్-సీ హాస్పిటల్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నది. దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది.
అర్హతలు: మెట్రిక్యుల్యేషన్ పాసవ్వాల్సి ఉంటుంది. సంబంధిత విభాగంలో పనిచేసిన అనుభవం ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 33 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక విధానం: పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా
వెబ్సైట్: wr.indianrailways.gov.in.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి