హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 194 మండలకేంద్రాల్లో ఉన్న మోడల్ స్కూళ్లలో 2021–22 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. విద్యార్థుల ఎంపికకు నిర్వహించే అర్హత పరీక్షకు ఈ నెల 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్లో పరీక్ష ఉంటుంది. ప్రవేశం పొందగోరే విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలకు మించకూడదు. అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా 6వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..