న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్ఎండీసీ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ అప్లికేషన్లు జూన్ 22 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 80 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఎగ్జిక్యూటివ్, సూపర్వైజర్, ఎన్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ పోస్టులు ఉన్నాయి. ఎంపికైనవారిని మూడేండ్ల కాలపరిమితిగాను నియమిస్తారు.
మొత్తం పోస్టులు: 80
ఇందులో కొల్లియెరి ఇంజినీర్ 2, లిసనింగ్ ఆఫీసర్ 2, మైనింగ్ ఇంజినీర్ 12, సర్వేయర్ 2, ఎలక్ట్రికల్ ఓవర్మ్యాన్ 4, మైన్ వోవర్మ్యాన్ 24, మెకానికల్ ఓవర్మ్యాన్ 4, మైన్ సిర్దార్ 38 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 22
వెబ్సైట్: www.nmdc.co.in