న్యూఢిల్లీ: నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) లిమిటెడ్ అప్రెంటిస్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తికలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చే నెల 15 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఎంపికైన అభ్యర్థులు ఛత్తీస్గఢ్లోని బైలడిల్ల ఐరన్ ఓర్లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 59
ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 16, టెక్నీషియన్ అప్రెంటిస్ 13, పాసా 30 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మైనింగ్ ఇంజినీరింగ్లో ఏదో ఒకటి చేసి ఉండాలి.
ట్రేడ్ అప్రెంటిస్కు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ అండ్ టెలికమ్యూనికేషన్, మైనింగ్, మోడర్న్ ఆఫీస్ ప్రాక్టీస్ మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్లో ఏదో ఒకటి, పాసా పోస్టులకు కోపాలో వొకేషనల్ ట్రైనింగ్ తీసుకుని ఉండాలి.
ట్రేడ్ అప్రెంటిస్ అభ్యర్థులు www.apprenticeshipindia.orgలో, గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అభ్యర్థులు www.mhrdnats.gov.inలో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో (ఈ-మెయిల్)
ఈ-మెయిల్: bld5hrd@nmdc.co.in
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 15
వెబ్సైట్: https://www.nmdc.co.in/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి