న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగాల్సిన పదో తరగతి పరీక్షలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) రద్దు చేసింది. అదేవిధంగా 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. కరోనా నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలని కొన్ని రోజులుగా డిమాండ్లు వస్తున్నాయి. దీంతో పరీలను వాయిదా, రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
జూన్లో జరగాల్సిన సెకండరీ కోర్సులకు సంబంధించిన థియరీ, ప్రాక్టికల్ పరీక్షలను రద్దు చేస్తున్నామని, సీనియర్ సెకండరీ, వొకేషనల్ కోర్సులకు సంబంధించిన థియరీ, ప్రాక్టికల్ పరీక్షలను తదుపరి ఆదేశాలు వచ్చేవరకు వాయిదా వేస్తున్నామని ఎన్ఐఓఎస్ తన అధికారిక నోటీస్లో పేర్కొంది. పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని ప్రకటించలేదు. అయితే ఇది సీబీఎస్సీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. సీబీఎస్సీ ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రద్దుచేయగా, 12వ తరగతి పరీక్షలను పోస్టుపోన్ అయిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి