హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్హాన్స్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆఫ్లైన్ దరఖాస్తులు ఈ నెల 28 వరకు అందుబాటులో ఉంటాయి. ఎంపికైనవారు బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 275
ఇందులో నర్సింగ్ ఆఫీసర్ 266, స్పీచ్ థెరపిస్ట్ అండ్ ఆడియాలజిస్ట్ 3, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (న్యూరోమస్క్యులార్) 1, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 2, ఎంఆర్ చిల్డ్రన్ టీచర్ (క్లినికల్ సైకాలజీ) 1, అసిస్టెంట్ డైటీషియన్ 1,
కంప్యూటర్ ప్రోగ్రామర్ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్, బీఎస్సీ (నర్సింగ్), స్పీచ్ పాథాలజీ, ఆడియాలజీ సబ్జెక్టుల్లో పీజీ, మెడికల్ సైన్సెస్లో పీహెచ్డీ, కంప్యూటర్ అప్లికేషన్స్లో పీజీ డిప్లొమా, పోస్ట్ ఎండీ, ఎంబీబీఎస్, సైకాలజీ సబ్జెక్టుతో బీఏ, బీఎస్సీ, సైన్స్లో బీఎస్సీ డిగ్రీతోపాటు డైటిక్స్లో డిప్లొమా, లైఫ్ సైన్సెస్ సబ్జెక్టుల్లో పీజీలో ఏదో ఒకటి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను పూర్తిగా నింపి సంబంధిత చిరునామాకు పంపించాలి.
అడ్రస్: డైరెక్టర్, నిమ్హాన్స్, పోస్ట్ బాక్స్ నం. 2900, హోసూర్ రోడ్, బెంగళూరు 560029
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 28
వెబ్సైట్: www.nimhans.ac.in