కోల్కతా : పశ్చిమ బెంగాల్లో కేంద్ర మంత్రి వీ మురళీధరన్ కాన్వాయ్పై స్థానికులు దాడి చేశారు. వెస్ట్ మిడ్నాపూర్ పంచ్క్కుడిలో మురళీధరన్ కాన్వాయ్పై రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడిలో తన వ్యక్తిగత సిబ్బందికి గాయాలయ్యాయని మురళీధరన్ ట్వీట్ చేశారు. టీఎంసీ కార్యకర్తలే దాడి చేసినట్లు కేంద్రమంత్రి ఆరోపించారు. దాడిలో మంత్రి కారు ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో తన పర్యటనను కేంద్ర మంత్రి రద్దు చేసుకున్నారు.