హైదరాబాద్ : రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కర్ఫ్యూ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ మహేశ్ భగవత్ హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలోని మొత్తం 43 చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘించిన 200 మందిపై ఇప్పటికే కేసులు నమోదు చేశామని, మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిపై వారం రోజుల్లో 16 వేల కేసులు పెట్టామని వెల్లడించారు.
‘‘90 శాతం వ్యాపారులు దుకాణాలు, బార్లు, కార్యాలయాలు రాత్రి 8 గంటలకూ మూసేస్తున్నారు. పదిశాతం మాత్రమే.. ఒత్తిడి చేసే వరకు మూయడం లేదు.
కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలి’’ అని సీపీ విజ్ఞప్తి చేశారు. రాత్రివేళ కారణం లేకుండా రోడ్డుపైకి వస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి