డెంటల్ సీట్ల భర్తీకి అదనపు కౌన్సెలింగ్

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి అదనపు మాప్ అప్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విడుదలచేసింది. ఆదివారం నుంచి ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అభ్యర్థులకు సూచించింది. వర్సిటీ విడుదలచేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడుత కౌన్సెలింగ్లో పాల్గొనవచ్చని తెలిపింది. వివరాలకు వర్సిటీ వెబ్సైట్ http://www.knruhs.telangana.gov.inను చూడవచ్చని తెలిపింది.
ఆయుష్ సీట్లకు..
నీట్ యూజీ అర్హత కటాఫ్ స్కోరును కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ 10 పర్సంటైల్ తగ్గించిన నేపథ్యంలో కటాఫ్ స్కోర్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని హెల్త్ యూనివర్సిటీ కోరింది. ఆయుష్ సీట్ల దరఖాస్తుకు ఈ నెల 20 తుది గడువు విధిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్ సందర్శించాలని సూచించింది.
తాజావార్తలు
- గాఢ నిద్రలో ఏనుగు పిల్ల.. తల్లి ఏనుగు ఏమి చేసిందంటే..
- టీచర్కు స్టూడెంట్ ఓదార్పు.. వైరల్ అవుతున్న లెటర్
- యువకుడి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య.!
- రామ్తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- కుక్కల దాడిలో 22 గొర్రెలు మృతి
- పెట్రోల్ మంట: భారత విజ్ఞప్తిని పట్టించుకోని సౌదీ అరేబియా
- భృంగివాహనంపై ఊరేగిన ముక్కంటీశుడు
- జగన్కు విదేశీ జైలు తప్పదు : నారా లోకేశ్
- జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయ తొలి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
- మహారాష్ట్రలో కొత్తగా 10,216 కరోనా కేసులు.. 53 మరణాలు