హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TEST-POLYCET-21 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 11 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. పదోతరగతి, తత్సమాన అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు: పదో తరగతి, తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణులైనవారు
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ఆధారంగా
అప్లికేషన్ ఫీజు: రూ.100
రూ.300 ఆలస్య రుసుముతో జూన్ 15వరకు అప్లికేషన్లు తీసుకుంటారు.
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 11
వెబ్సైట్: polycetts.nic.in, sbte.telangana.gov.in