న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ సచిన్ (56 కేజీలు) స్వర్ణంతో మెరిశాడు. పొలాండ్ వేదికగా శుక్రవారం టోర్నీ చివరి రోజు జరిగిన ఫైనల్లో సచిన్ 4-1తో ఎర్బోలాట్ సాబిర్ (కజకిస్థాన్)ను చిత్తుచేశాడు. మహిళల విభాగంలో భారత బాక్సర్లు క్లీన్స్వీప్ చేసి ఏడు స్వర్ణాలతో చరిత్ర సృష్టించగా.. పురుషుల కేటగిరీలో సచిన్ ఒక్కడే పసిడి పట్టాడు. దీంతో టోర్నీలో 8 బంగారు, 3 కాంస్యాలతో మొత్తం భారత్కు 11 పతకాలు దక్కాయి.