న్యూశాయంపేట, ఏప్రిల్ 4: ‘కరోనా టీకా సురక్షితం. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి’ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మంగళవారం న్యూశాయంపేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్యాధికారి సమక్షంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. ఆరోగ్యశాఖ సూచనలు తప్పక పాటించాలని, అర్హులైనవారు వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలన్నారు. ఎమ్మెల్యే వెంటఅదనపు డీఎంహెచ్వో మదన్మోహన్రావు, వైద్యాధికారి బీ మౌనిక, డాక్టర్ హర్షవర్ధిని, సీవో సదానందం, రాజేశ్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.Jangaon 05-05-2021