మేడ్చల్ కలెక్టరేట్, ఏప్రిల్ 19: కరోనా బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి సూచించారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని పలు వార్డులు, పలు కాలనీల్లో సోమ వారం సోడియం హైపోక్లోరైట్ను పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కు లు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ8వ వార్డులో కౌన్సిలర్ హరిగౌడ్, నాగారం మున్సిపల్ కమిషనర్ వాణీరెడ్డి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
కీసర, ఏప్రిల్ 19: కరోనా వ్యాప్తి నేపధ్యంలో కీసరలోని 8వ వార్డులో ఉప సర్పంచ్ కె.బాలమణి హైపోక్లోరైట్ను సోమవారం పిచికారీ చేయించారు. కాలనీవాసులు ఇంట్లోని బయటికి రావద్దని, తప్పనిసరి అయితే మాస్కులను ధరించి బయటికి రావాలన్నారు.
ఘట్కేసర్,ఏప్రిల్19: కరోనా వ్యాప్తి నేపధ్యంలో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సోమవారం ఘట్కేసర్,పోచారం మున్సిపాలిటీల్లో ప్రత్యేక వాహనాలతో సోడియం హైపోక్లోరైట్ రసాయనాల మిశ్రమాన్ని జనసంచార ప్రాంతాల్లో పిచికారీ చేశారు. పోచారం మున్సిపాలిటీలలో చైర్మన్ కొండల్రెడ్డి, కమిషనర్ సురేశ్ కౌన్సిలర్ల సమక్షంలో సిబ్బంది నారపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అన్నోజిగూడ, ఎల్ఐజీ కాలనీ ప్రాంతాల్లో పిచికారీ చేశారు. ఘట్కేసర్ మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ మాధవరెడ్డి, కౌన్సిలర్లు ఆంజనేయులుగౌడ్,జాంగీర్ల ఆధ్వర్యంలో సిబ్బంది ఘట్కేసర్ ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, ప్రభుత్వ దవాఖాన తదితర ప్రాంతాల్లో పిచికారీ చేశారు.
శామీర్పేట, ఏప్రిల్ 19 : జగ్గంగూడ-సంపన్బోల్ గ్రామ స్తులు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని సర్పంచ్ సీహెచ్ విష్ణువర్ధన్రెడ్డి సూచించారు. జగ్గంగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని రోడ్లు, కాలనీల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణా న్ని సోమవారం పిచికారీ చేశారు. గ్రామంలో కేసులు పెరుగుతున్నందున ఈనెల 19వ తేదీ నుంచి మే 5 వరకు ప్రతి రోజూ సాయంత్రం 6 ఉదయం 7 గంటల వరకు దుకా ణాలను మూసివేస్తున్నట్లు గ్రామ పంచాయతీ ద్వారా తీర్మా నం చేసినట్లు ఆయన తెలిపారు.కార్యక్రమంలో కార్యదర్శి రాజేశ్వర్రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.