ప్రజలకు అధికారుల సూచన
లేకపోతే రూ.వెయ్యి జరిమానా తప్పదని హెచ్చరిక
కాగజ్నగర్ టౌన్, ఏప్రిల్ 7 : కరోనా వైరస్ను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పక ధరించాలని తహసీల్దార్ ప్రమోద్కుమార్ అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కొవిడ్ నియంత్రణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్తో కలిసి రాజీవ్గాంధీ చౌరస్తాలో అవగాహన కల్పించారు. మాస్కులు ధరించని పలువురికి జరిమానా విధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా వైరస్ను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నా యని తెలిపారు. మాస్క్లు లేకుండా బయటకు రావొద్దని, భౌతికదూరం పాటించాలని సూచించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ బంగారు శ్రీనివాస్, సిబ్బంది సునిల్, తదితరులు పాల్గొన్నారు.
ఆటో ద్వారా అవగాహన
జైనూర్, ఏప్రిల్ 7 : ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ఈవో శంకర్ సూచించారు. జైనూర్లో బుధవారం ఆటోతో ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తున్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించా రు. భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలన్నారు. మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో, రోడ్లపై కనిపిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మాస్క్ ధరించకుంటే వెయ్యి జరిమానా
బెజ్జూర్, ఏప్రిల్ 7 : కొవిడ్ రెండోదశ విజృంభిస్తున్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో తిరిగే ప్రతి వ్యక్తీ మాస్క్ ధరించాలని, లేకుంటే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని కొవిడ్ కమిటీ హెచ్చరించింది. ఈ సందర్భంగా మొదటిరోజు బుధవారం మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో కమిటీ సభ్యులు పర్యటించారు. మాస్కులు ధరించని వారికి హెచ్చరికలు జారీ చేస్తూ అవగాహన కల్పించారు. మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో ఎవరు కనబడినా జరిమానా తప్పదని హెచ్చరించారు. రెవెన్యూ శాఖ నుంచి ఆర్ఐ రాథోడ్ రాంసింగ్, పోలీస్ శాఖ నుంచి కానిస్టేబుల్ జాదవ్ వినోద్, పంచాయతీరాజ్ శాఖ నుంచి కార్యదర్శి బండి శ్రావణ్ను కమిటీ సభ్యులుగా నియమించారు. కలెక్టర్ ఆదేశాలతో వీరు ప్రజలకు జరిమానా విధించే అధికారం కల్పించినట్లు పేర్కొన్నారు. మాస్క్ ధరించడంతో పాటు శానిటైజర్ వాడాలని, భౌతిక దూరం పాటిస్తూ కరోనా వ్యాప్తి నియంత్రణకు సహకరించాలని వారు కోరారు.
ఇవి కూడా చదవండి..
ఆస్పత్రిలో నాణ్యత లేని భోజనం.. కాంట్రాక్టర్పై చేయి చేసుకున్న మంత్రి
మెట్రో సూచన.. రాత్రి 10కి ముందే ప్రయాణాలు ముగించుకోండి