ముంబై,జూన్ 10: నిన్న భారీనష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి.అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు కనిపించినప్పటికీ దేశీయంగా మెటల్, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు కాస్త పెరిగాయి. దీంతో సెన్సెక్స్ దాదాపు 100 పాయింట్లు, నిఫ్టీ 70 పాయింట్ల లాభాల్లో కనిపించాయి. ఐటీ, ఫార్మా, మెటల్, బ్యాంకింగ్ సూచీలు సూచీలను లాభాల్లో నడుస్తున్నాయి. నిఫ్టీ కీలక 15700 పాయింట్ల పైకి చేరుకోగా.. అదానీ పవర్, బాటా మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో ఉన్నాయి.