హైదరాబాద్: రాష్ట్రంలోని బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఇంగ్లిష్ మీడియం ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశ దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోనివారు అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. బీసీ రెసిడెన్షియల్ దరఖాస్తులకు ఈ నెల 5తో గడువు ముగియనుంది. కాగా, ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి రెసిడెన్షియల్ కాలేజీల్లో ఒకేషనల్ కోర్సులను కూడా ప్రవేశపెట్టామని వెల్లడించారు. ఈ అవకాశాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వెబ్సైట్: mjptbcwrei-s.telangana.gov.in