ఢిల్లీ ,జూన్ 16: కొత్త వేరియంట్లను గుర్తించడంపై రకరకాల చర్చలుజరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ స్పందించారు. కొత్త వేరియంట్ డెల్టా ప్లస్, వేరియంట్ అఫ్ కన్సర్న్ గా ఇంకా వర్గీకరించలేదని ఆయన స్పష్టం చేశారు. “ అవును కొత్త వేరియంట్ గుర్తించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇది వేరియంట్ అఫ్ ఇంటరెస్ట్ (విఓఐ) గా మాత్రమే చూడాలి, అది ఇంకా వేరియంట్ అఫ్ కన్సర్న్ (విఓసి)గావర్గీకరణ జరగలేదు. విఓసి అంటే మనకు ఉన్న అవగాహన ప్రకారం, పెరిగిన తీవ్రత వల్ల మానవాళిపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అయితే డెల్టా ప్లస్ వేరియంట్ గురించి స్పష్టత లేదు” అని డాక్టర్ పాల్ తెలిపారు.
‘దేశంలో దాని ఉనికిని చూడటం, తగిన ప్రజారోగ్య స్పందన తీసుకోవడమే ముందుకు వెళ్ళే మార్గం అని డాక్టర్ పాల్ చెప్పారు. “ఈ మార్పు ప్రభావాన్ని మనం చూడాలి, ఈ వేరియంట్ శాస్త్రీయ పద్ధతిలో; ఇది మన దేశం వెలుపల కనుగొనబడింది. మన దేశంలో దానిశక్తిని ,ఉనికిని, పెరుగుదలను అంచనా వేయడానికి, గుర్తించడానికి దీనిని ఇండియన్ సార్స్-కోవ్-2 కన్సార్టియం ఆన్ జెనోమిక్స్ (ఐఎన్ఎస్ఏసిఓజి) ద్వారా పర్యవేక్షించాలి. వైరస్కు సంబంధించి ఇదే మార్గం” అని డాక్టర్ పాల్ అన్నారు. దాదాపు 28 ప్రయోగశాలలతో కూడిన మన సమగ్ర వ్యవస్థకు ఇది భవిష్యత్ లో చాలా ముఖ్యమైన అంశమని డాక్టర్ పాల్ పేర్కొన్నారు. వ్యవస్థ నిరంతరం దీనిని చూస్తుంది, దాని ప్రాముఖ్యతను అధ్యయనం చేస్తుంది. ఇది సైన్స్ పరంగా అర్థం చేసుకోవలసిన విషయం’ అని డాక్టర్ పాల్ తెలిపారు.