న్యూఢిల్లీ: ఇండియన్ ఆర్మీలో జెడ్జి అడ్వకేట్ జనరల్ బ్రాంచీ (27వ కోర్సు అక్టోబర్ 2021)లో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్లుగా చేరేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 4 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అవివాహిత పురుష, మహిళా లా గ్రాడ్యుయేట్లు అర్హులని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జడ్జ్ అడ్వకేట్ జనరల్ (జేఏజీ) బ్రాంచిలో ఎస్ఎస్సీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది.
మొత్తం పోస్టులు: 8
ఇందులో పురుషులు-6, మహిళలు-2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా రిజిస్టర్ అయి ఉండాలి.
వయస్సు: 2021, జూలై 1 నాటికి 21 నుంచి 27 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి. అంటే 1994, జూలై 2 నుంచి 2000, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
పే స్కేల్: ట్రెయినింగ్ సమయంలో ప్రతినెల రూ.56,100 చెల్లిస్తారు.
ప్రొబేషనరీ పీరియడ్: 6 నెలలు
శిక్షణ: చెన్నైలోని ఓటీఏలో 49 వారాలపాటు శిక్షణనిస్తారు.
ఎంపిక ప్రక్రియ: దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. వారిని ఎస్ఎస్బీ ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు. అందులో ఉత్తీర్ణులైనవారిని మెడికల్ టెస్టుకు పిలుస్తారు. ఇందులో ఉత్తీర్ణులైనవారిని శిక్షణకు ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 4
వెబ్సైట్: www.joinindianarmy.nic.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి