హైదరాబాద్: దేశంలో అతిపెద్దదైన సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) జూలై-2021 సెషన్కు సంబంధించిన దరఖాస్తు గడువును పొడిగించింది. ఈనెల 30 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 15న దరఖాస్తు గడువు ముగిసింది. అయితే కరోనా నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల గడువు పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతోపాటు టర్మ్ ఎండ్ పరీక్షల (TEE) కోసం పరీక్ష ఫారాలు, ప్రాజెక్టు రిపోర్టులు, ఫీల్డ్ వర్క్ జర్నల్, ఇంటర్న్ షిప్, అసైన్మెంట్లు మొదలైన వాటిని సమర్పించేందుకు చివరి తేదీని కూడా పొడిగించింది.
వెబ్సైట్: ignou.ac.in, ignou.samarth.edu.in