భూపాలపల్లి రూరల్, ఏప్రిల్4:రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులకు మే 1వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో కొవిడ్ నిబంధనల ప్రకారం వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 10 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షలకు 26 రోజులు మాత్రమే సమయం ఉండడంతో పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు, వసతులకు సంబంధించి నివేదికను ఉన్నతాధికారులకు ఇప్పటికే పంపించారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష తరగతుల ను రద్దు చేయడంతో ఇంటర్ సబ్జెక్టుల్లో 30 శాతం సిలబస్ను తగ్గించారు. ఇంటర్ ఇంటర్మీడియట్ విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా స్టడీ మెటిరీయల్ అందించినది. ఈనెల 30 వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తారు.
జిల్లాలో 26 జూనియర్ కళాశాలలు
జిల్లాలో 26 జూనియర్ కళాశాలలు ఉండగా ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 5, గురుకులాలు 3, కేజీబీవీలు 3, ఆదర్శ కళాశాలలు 6, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 9 ఉన్నాయి. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 1907 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1629 మంది చదువుతున్నారు. రెగ్యులర్ విద్యార్థులతోపాటు మరి కొందరు విద్యార్థులు ఇంప్రూమెంట్ పరీక్షలు రాయనున్నారు. గతేడాది 8 కేంద్రాల్లో వార్షిక పరీక్షలు నిర్వహించారు. ఈ సారి విద్యార్థుల సంఖ్య పెరగడంతో 10 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అసైన్మెంట్ రూపంలో పరీక్షలు
కొవిడ్ నిబంధనల కారణంగా కళాశాలలు మూసి వేయడంతో ఈనెల 1వ తేదీన నిర్వహించాల్సిన నైతికత-మానవ విలువలు, 3వ తేదీన జరగాల్సిన పర్యావరణ విద్యా పరీక్షల ను మార్పు చేస్తూ ఇంటర్ బోర్డు ప్రకటించింది. విద్యార్థులు ఇంటి నుంచి అసైన్మెంట్ రూపంలో ఏ-4 సైజు కాగితాలపై పరీక్షలు నిర్వహించారు. ప్రాజెక్ట్ వర్క్ను రద్దు చేశారు. ఈనెల 7వ తేదీన నిర్వహించాల్సిన ప్రాక్టికల్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి.
ఇవి కూడా చూడండి..
వినూత్నంగా ఎలక్ట్రిక్ బైక్పై వరుడి ఊరేగింపు
కరోనా ఎఫెక్ట్ : జమ్మూకశ్మీర్లో పాఠశాలల మూసివేత