హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉన్న హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 53 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో మేనేజర్, ఆఫీసర్, కన్సల్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ విధానంలో, శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.
మొత్తం పోస్టులు: 53
ఇందులో జనరల్ మేనేజర్ 1, అడిషనల్ జనరల్ మేనేజర్ 1, డీజీఎం 3, సీనియర్ మేనేజర్ 4, మేనేజన్ 8, డిప్యూటీ మేనేజర్ 1 (శాశ్వత ప్రాతిపదికన), డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ 2, ప్రాజెక్ట్ మేనేజర్ 1, ప్రాజెక్ట్ ఆఫీసర్ 28 (ఎఫ్టీసీ), సీనియర్ కన్సల్టెంట్ 3, కన్సల్టెంట్ 1 (ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్) చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అనుభవం తప్పనిసరి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.300, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజులేదు.
దరఖాస్తులకు చివరితేదీ: శాశ్వత పోస్టులకు జూలై 20, ఎఫ్టీసీ పోస్టులకు ఆగస్టు 10, కాంట్రాక్ట్ పోస్టులకు ఆగస్టు: 30
వెబ్సైట్: https://www.hslvizag.in