న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఈసీఎల్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 30 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 206 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో కోపా, ఎలక్ట్రిషన్, ఫిట్టర్, వెల్డర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం అకడమిక్ మెరిట్ ద్వారా ద్వారా అభ్యర్థులను అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
పోస్టుల సంఖ్య: 206
ఇందులో ఎలక్ట్రిషన్ 20, ఫిట్టర్ 40, మెషినిస్ట్ 16, వెల్డర్ 40, కోపా 48, స్యూవింగ్ టెక్నాలజీ (టైలరింగ్) 42 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ. పదో తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 31
వెబ్సైట్: www.hecltd.com