వరంగల్: వైద్య విద్యలో ఎండీఎస్ సీట్ల భర్తీకి తుది ఆదివారం, సోమవారం తుది విడత వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. వెబ్ కౌన్సెలింగ్కు సంబంధించిన నోటిఫికేషన్ను కాళోజీ హెల్త్ వర్సిటీ జారీచేసింది. దీనిద్వారా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లోని డెంటల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చని అధికారులు. అయితే మొదటి విడతలో సీటు కేటాయించినా చేరని అభ్యర్థులు, ఆలిండియా కోటా కౌన్సెలింగ్ కింద ఇప్పటికే చేరిన అభ్యర్థులు అనర్హులుగా ప్రకటించారు. పూర్తి వివరాలకు www.knruhs.telangana.gov.inలో చూడవచ్చని తెలిపారు.