పర్యావరణానికి మించిన సంపద లేనేలేదని, ప్రస్తుత కరోనా సమయంలో ఈ విషయం స్పష్టంగా రుజువైందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాబివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ప్రస్తుతం భూగోళం పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, స్వచ్ఛమైన ప్రాణవాయువు దొరకక జనం పరితపిస్తున్నారని శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇచ్చిన సందేశంలో పేర్కొన్నారు. భవిష్యత్తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తున్నదని తెలిపారు. జీవవైవిధ్యంతో కూడిన హరిత తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకొని మొక్కలు నాటాలని మంత్రి దయాకర్రావు పిలుపునిచ్చారు.