న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన ఐటీఐ లిమిటెడ్లో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 40 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో మెకానికల్ ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎంపికైనవారు ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 40
ఇందులో మెకానికల్ ఇంజినీర్ 29, ఎలక్ట్రికల్ ఇంజినీర్ 7, ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ 4 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతితోపాటు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ట్రేడ్లలో 60 శాతం మార్కులతో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. 18 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. డిప్లొమాలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వారిని రాత పరీక్షకు ఆహ్వానిస్తారు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 15
పరీక్ష తేదీ: జూలై 4
వెబ్సైట్: https://www.itiltd.in/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి