హైదరాబాద్: ఎంసెట్ ఇంజినీరింగ్ సీట్లను రద్దు చేసుకునే గడువును ప్రభుత్వం పొడిగించింది. మొదటి విడత కౌన్సెలింగ్లో కేటాయించిన సీట్లను విద్యార్థులు ఈ నెల 28 వరకు క్యాన్సల్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దీంతో తుది విడత కౌన్సెలింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నది. ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఆగస్టు 30న నిర్వహించారు. ఇందులో 60,941 కన్వీనర్ కోటా సీట్లు భర్తీఅయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 175 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 74,071 ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయి.