న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ (డీఎస్ఎస్సీ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందులో స్టెనో, ఎల్డీసీ, సివిల్ మోటార్, ఎంటీసీ వంటి పోస్టులు ఉన్నాయి. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను ఈ నెల 22లోపు పంపించాలి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం పోస్టులు: 83
ఇందులో మల్టీటాస్కింగ్ స్టాఫ్ 60, స్టెనోగ్రాఫర్ 4, లోయర్ డివిజన్ క్లర్క్ 10, సివిలియన్ మోటార్ డ్రైవర్ 7, సుఖాని 1, కార్పెంటర్ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఇంటర్ లేదా 10+2 పాసైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, స్కిల్టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో. దరఖాస్తుల్లో పేర్కొన్న విద్యార్హతల ఆధారంగా అర్హులైన అభ్యర్థులను రాతపరీక్షకు ఆహ్వానిస్తారు.
పరీక్ష విధానం: రాతపరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్నెస్, ట్రేడ్ స్పెసిఫిక్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
దరఖాస్తులకు చివరితేదీ: మే 22
వెబ్సైట్: dssc.gov.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..