హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న దోస్త్ మొదటి విడుత రిజిస్ట్రేషన్లు నేటితో ముగియనున్నాయి. బుధవారం వరకు 1,17,601 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని దోస్త్ కన్వీనర్ లింబాద్రి వెల్లడించారు. ఆధార్తో అనుసంధానమై ఉన్న మొబైల్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మీ-సేవా కేంద్రాల్లోనూ దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలోని 105 సహాయ కేంద్రాల్లోనూ నమోదు చేసుకోవచ్చన్నారు. అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, వర్సిటీల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. tsappfolio ద్వారా దోస్త్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఫేస్బుక్, ట్విట్టర్లోనూ ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామని చెప్పారు. దోస్త్ యూట్యూబ్ చానల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ నెల 23 నుంచి 27వ తేదీవరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని వెల్లడించారు.