హైదరాబాద్: రాష్ట్రంలో దూర విద్యావిధానంలో పదో తరగతి, ఇంటర్ దరఖాస్తుల గడువును అధికారులు పొడిగించారు. రూ.50 ఆలస్య రుసుముతో ఈ నెల 31వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం https://www.telanganaopenschool.org/ వెబ్సైట్ను చూడవచ్చని పేర్కొన్నారు.