న్యూఢిల్లీ: మహారత్న కంపెనీ అయిన పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఖాళీగా ఉన్న డిప్లొమా ట్రెయినీ పోస్టుల భర్తీకి నార్తర్న్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 35 డిప్లొమా ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తుంది.
మొత్తం పోస్టులు: 35
ఇందులో డిప్లొమా ట్రెయినీ (ఎలక్ట్రికల్) 30, డిప్లొమా ట్రెయినీ (సివిల్) 5 ఖాళీలు ఉన్నాయి.
అర్హత: కనీసం 75 శాతం మార్కులతో మూడేండ్ల ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. డిప్లొమా లేకుండా బీఈ/బీటెక్/ఎంటెక్ చేసినవారిని పరిగణనలోకి తీసుకోరు. 2021, జూన్ 15 నాటికి 27 ఏండ్ల లోపు వయస్సు కలిగినవారై ఉండాలి.
స్టయిఫండ్: రూ. 27,500 (శిక్షణా కాలం పూర్తయిన తర్వాత జూనియర్ ఇంజినీర్ స్థాయిలో రూ. 25,000-1,17,500 పే స్కేల్ ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా
పరీక్ష విధానం: పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 170 మార్కులకు ఉంటుంది. దీన్ని రెండు భాగాలుగా విభజిస్తారు పార్ట్ 1 లో 120 ప్రశ్నలు టెక్నికల్ నాలెడ్జ్ లేదా ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. పార్ట్ 2 లో 50 ప్రశ్నలు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, డేటా సఫిషియన్సీ అండ్ ఇంటర్ప్రిటేషన్, న్యూమరికల్ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 2 గంటలు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు మార్కులను కోత విధిస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 15
అప్లికేషన్ ఫీజు: రూ. 300
వెబ్సైట్: www.powergridindia.in