మాదిరి ప్రశ్నలు
1. కింది వానిలో సరైనవి ఏవి? (సి)
1. రాజ్యాంగ పరిషత్తు శాశ్వత అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ను ఎన్నుకున్నారు
2. రాజ్యాంగ పరిషత్తు ముఖ్య సలహాదారు గా బెనెగల్ నర్సింగరావు వ్యవహరించారు
3. రాజ్యాంగ పరిషత్తు ముఖ్య సలహాదారుగా బీఆర్ అంబేద్కర్ వ్యవహరించారు
ఎ. 1 సరైంది బి. 1, 3 సరైనవి
సి. 1, 2 సరైనవి డి. 3 సరైంది
2. కింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి? ( బి)
ఎ. రాజ్యాంగ రచన క్రమంలో రాజ్యాంగ పరిషత్తు అన్ని అంశాలను ఓటింగ్ ద్వారా నిర్ణయించింది
బి. రాజ్యాంగ పరిషత్తు సమ్మతి, సమన్వయ పద్ధతిని వినియోగించింది
సి. ఓటింగ్, సమ్మతి, సమన్వయ పద్ధతిని వినియోగించింది డి. పైవేవి కాదు
3. పట్టాబి సీతారామయ్య నేతృత్వం వహించిన కమిటీలు ఏవి? (సి)
1. సభా కమిటీ
2. క్రిడెన్షియల్ కమిటీ
3. చీఫ్ కమిషనర్ల ప్రావిన్స్ల కమిటీ
ఎ. 1, 2 బి. 2, 3
సి. 1, 3 డి. 1, 2, 3
4. కింది వానిలో రాజ్యాంగ పరిషత్తు నిర్వహించిన విధులు ఏవి? (డి)
ఎ. రాజ్యాంగ రచన
బి. పార్లమెంట్గా వ్యవహరించడం
సి. జాతీయ జెండా ఆమోదం
డి. పైవన్నీ
5. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వం వహించిన మూసాయిదా కమిటీకి సంబంధించి కింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి? (డి)
1. ఈ కమిటీ ఆగస్ట్ 29, 1947న ఏర్పాటైంది
2. మూసాయిదా కమిటీ మొత్తం 141 రోజులు పనిచేసింది
3. ఇందులో ఆరుగురు సభ్యులు ఉన్నారు
4. బెనెగల్ నర్సింగరావు ఇందులో సభ్యత్వం కలిగి ఉన్నారు
ఎ. 1, 2 సరైనవి
బి. 1, 3, 4 సరైనవి
సి. 1, 2, 3, 4
డి. 1, 2, 3 సరైనవి
6. వివిధ కమిటీలు, వాటి చైర్మన్లతో జతపర్చండి. (సి)
1. సారథ్య కమిటీ ఎ. వరదాచారి
2. రాష్ర్టాల రాజ్యాంగాల కమిటీ బి. మోటూరి సత్యనారాయణ
3. భాషా కమిటీ సి. సర్ధార్ వల్లభాయ్ పటేల్
4. పౌరసత్వంపై తాత్కాలిక కమిటీ డి. రాజేంద్రప్రసాద్
ఎ. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి. 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
సి. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి. 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
7. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వం వహించిన మూసాయిదా కమిటీలో భాగం కానివారుఎవరు? (డి)
ఎ. గోపాలస్వామి అయ్యంగార్
బి. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
సి. కె.ఎం. మున్షి
డి. గోపీనాథ్ బర్దోలాయ్
8. కింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి? (బి)
1. రాజ్యాంగ సభలో లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని అంబేద్కర్ ప్రవేశపెట్టారు
2. రాజ్యాంగ సభలో లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టారు
3. 1947 జనవరి 22వ తేదీన లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు
ఎ. 1, 3 సరైనవి
బి. 2 సరైనది
సి. 2, 3 సరైనవి
డి. 1 సరైంది
9. రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి కింది వానిలో సరికానిది ఏది? (సి)
ఎ. ఇది పరోక్ష పద్ధతిలో ఎన్నికైంది
బి. ఇది సార్వభౌమ సంస్థ కాదు
సి. ఇది ప్రత్యక్షంగా ఎన్నికైంది
డి. ఇందులో కొందరు నామినేటెడ్ సభ్యులు కూడా ఉన్నారు
10. దేశ విభజన మూలంగా రాజ్యాంగ పరిషత్తులో స్థానం కోల్పోయిన వారిని గుర్తించండి? (డి)
1. డాక్టర్ బీఆర్ అంబేద్కర్
2. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
3. సోమ్నాథ్ లహరి
ఎ. 1, 2 బి. 2
సి. 2, 3 డి. 1, 3
11. కింది వాటిని కాలక్రమం ఆధారంగా అమర్చండి? (ఎ)
1. క్యాబినెట్ మిషన్ ప్రణాళిక
2. ఆగస్ట్ ఆఫర్
3. క్రిప్స్ రాయభారం
4. ముసాయిదా కమిటీ ఏర్పాటు
ఎ. 2, 3, 1, 4 బి. 2, 1, 3, 4
సి. 2, 4, 1, 3 డి. 2, 3, 4, 1
12. రాజ్యాంగ పరిషత్తుకు ఏ ప్రావిన్స్ నుంచి ఎక్కువ మంది ప్రతినిధులు ఉన్నారు? ( సి)
ఎ. మద్రాస్
బి. పశ్చిమబెంగాల్
సి. యునైటెడ్ ప్రావిన్స్
డి. సెంట్రల్ ప్రావిన్స్-బేరర్
13. కింది సంఘటనలు, తేదీలను జతపర్చండి. (బి)
1. లక్ష్యాలు-ఆశయాల తీర్మానం ప్రవేశపెట్టిన రోజు ఎ. జనవరి 26, 1950
2. రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు బి. ఆగస్ట్ 29, 1947
3. ముసాయిదా కమిటీ ఏర్పాటైన రోజు సి. డిసెంబర్ 13, 1946
4. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు డి. నవంబర్ 26, 1949
ఎ. 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
బి. 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
సి. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి. 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
14. రాజ్యాంగ పరిషత్తుకు ఏ స్వదేశీ సంస్థానం నుంచి ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు? (ఎ)
ఎ. మైసూర్ బి. హైదరాబాద్
సి. గ్వాలియర్ డి. ట్రావెన్కోర్
15. రాజ్యాంగ పరిషత్తులో హిందూ మహాసభకు ప్రాతినిథ్యం వహించింది ఎవరు? (సి)
1. శ్యామప్రసాద్ ముఖర్జి
2. హెచ్పీ మోడి
3. ఎం.ఆర్.జయకర్
ఎ. 1, 2 బి. 1
సి. 1, 3 డి. 1, 2, 3
16. కింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి? (ఎ)
ఎ. రాజ్యాంగ పరిషత్తులో కొంతమంది ఎన్నిక కాగా, కొంతమంది నామినేట్ అయ్యారు
బి. రాజ్యాంగ పరిషత్తు సభ్యులు అందరూ ఎన్నికైన వారే ఉన్నారు
సి. రాజ్యాంగ పరిషత్తులో మహిళలు లేరు డి. రాజ్యాంగ పరిషత్తులో ఎన్నికైన వారి కంటే నామినేట్ అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది
17. బేగం ఎయిజాజ్ రసూల్కు సంబంధించి కింది వానిలో సరైనది ఏది? (బి)
ఎ. రాజ్యాంగ పరిషత్తుకు ఆమె ఉపాధ్యక్షురాలు
బి. రాజ్యాంగ పరిషత్లో సభ్యురాలిగా ఉన్న ఏకైక ముస్లిం మహిళ
సి. రాజ్యాంగ పరిషత్తు పార్లమెంట్ రూపంలో సమావేశం అయినప్పుడు అధ్యక్షత వహించిన మహిళ
డి. ఏదీ కాదు
18. న్యాయవిద్య చదవకుండా మూసాయిదా కమిటీలో సభ్యుడిగా ఉన్న ఏకైక వ్యక్తి ఎవరు? (సి)
ఎ. కృష్ణ స్వామి అయ్యర్
బి. బీఎల్ మిట్టర్
సి. టి.టి. కృష్ణమాచారి
డి. కె.ఎం. మున్షి
19. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజే అమల్లోకి వచ్చిన అంశాలు కింది వానిలో ఏవి? (డి)
ఎ. పౌరసత్వం బి. ఎన్నికలు
సి. తాత్కాలిక పార్లమెంట్
డి. పైవన్నీ