ప్రశాంత్నగర్, మే 16 : కోమటి చెరువు ప్రాంతంలో ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించిన నెక్లెస్ రోడ్డు కొత్తరూపాన్ని సంతరించుకుంది. వాకింగ్, రన్నింగ్ చేయడానికి వీలుగా సింథటిక్ ట్రాక్ను నిర్మిస్తున్నారు. నెక్లెస్ రోడ్డు పనులు దశలవారీగా జరుగుతున్న నేపథ్యంలో సింథటిక్ ట్రాక్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పనులను మంత్రి హరీశ్రావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
అథ్లెటిక్ క్రీడలన్నీ నెక్లెస్ రోడ్డుపైనే..
సింథటిక్ ట్రాక్పై రన్నింగ్, వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతున్నదని మంత్రి భవిష్యత్ను దృష్టిలో నెక్లెస్ రోడ్డును నిర్మిస్తున్నారు. మహానగరాల్లో నిర్మిస్తున్న అథ్లెటిక్ సింథటిక్ ట్రాక్ మంత్రి చొరవతో సిద్దిపేటలో ఏర్పాటు చేస్తున్నారు.
సిద్దిపేట ఎర్రచెరువుకు కొత్త అందాలు
పట్టణంలోని ఎర్రచెరువుకు కొత్త అందాలు వచ్చి చేరాయి. మంత్రి హరీశ్రావు ప్రత్యేక కృషితో మున్సిపల్ వైస్ చైర్మన్ జం గిటి కనకరాజు ఎర్రచెరువు కట్టపై వాకర్స్, ప్రజలు సేదతీరేలా గజ్బౌల్ ఏర్పాటు చేయించారు. కట్టమైసమ్మ ఆలయం పక్కనే నిర్మించడంతో అటు భక్తులకు కూడా ఉపయోగకరంగా మారింది. గజ్బౌల్ ఏర్పాటుతో ఎర్రచెరువుకు కొత్తకళ వచ్చింది.