ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మాదిగ డైరీ ఆవిష్కరణ
హాజరైన నాగర్కర్నూల్ ఎంపీ రాములు
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 18 : ప్రభుత్వం అందరి అభ్యున్నతికి కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అరుంధతి భవనంలో నాగర్కర్నూల్ ఎంపీ రాములు తో కలిసి మాదిగ డైరీని ఆవిష్కరించారు. ముందుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్రామ్ చిత్రపటాలకు పూలమాల నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తున్నదన్నారు. కులాలు, మతాలుగా విడిపోకుండా అందరం కలిసి రాష్ర్టాభివృద్ధికి పనిచేసి మన హక్కులను సా ధించుకుందామని పిలుపునిచ్చారు. ఎంపీ రాములు మాట్లాడుతూ ఏబీసీడీ వర్గీకరణకోసం దండోరా పోరాటాల ఫలితంగా వచ్చిన ఉషామెహరా కమిషన్ నివేదిక ఇచ్చిందని, ఏబీసీడీ వర్గీకరణ అవసరాన్ని పార్లమెంట్లో ప్రస్తావించినట్లు తెలిపారు. త్వరలోనే ఇతర రాష్ర్టాల ఎంపీలతో చర్చించి ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో పెట్టేవిధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రమేశ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సింగిరెడ్డి పరమేశ్వర్, యాదయ్య, రాయికంటి రాందాస్, రామ్మోహన్, గడ్డమీది గోపాల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పుట్టపాగ రఘపతి, ఎంఈఎఫ్ రాష్ట్ర నాయకులు గాలి యాదయ్య, రవీంద్రనాథ్, వడ్డెమాన్ బాలపీర్, కొం డన్న, పాతూర్ రమేశ్, కూచూర్ యాదయ్య, పట్న చెన్న య్య, సంధ్యకోటి, హాజమ్మ, సువార్తమ్మ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
సీసీఎస్ పోలీసులకు నటుడు నరేశ్ పిర్యాదు
IPL 2021: చితక్కొట్టిన మాక్స్వెల్, డివిలియర్స్..ఆర్సీబీ స్కోర్ 204