మిడ్జిల్, మే 13 : ప్రభుత్వ దవాఖానలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంవో విజయ్కుమార్ అన్నా రు. గురువారం మండల కేం ద్రంలోని ప్రభుత్వ దవాఖాన ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో ప్రజలకు కరోనా వ్యాక్సిన్పై అవగాహన కల్పిస్తూ, కరోనా లక్షణాలు ఉంటేనే పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు ప్రభుత్వం నుంచి అందజేస్తున్న మెడికల్ కిట్ను ఉపయోగించాలని సూచించారు. సమావేశంలో ఎంపీటీసీ గౌస్, కాయకల్ప అధికారి లక్ష్మి, డాక్టర్ వంశీప్రియ, నాయకులు బాలస్వామి, రాంగౌడ్ ఉన్నారు.